Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : పిసి పల్లి మండలంలో ఘనంగా ముగిసిన విశ్వబ్రాహ్మణ కార్తీక వనభోజనాల కార్యక్రమాలు పెద్దచెర్లోపల్లి, అమరావతి జ్యోతి : పిసిపల్లి మండల కేంద్రంలో సోమవారం మండల విశ్వబ్రాహ్మణ కమిటీ ఆధ్వర్యంలో కార్తీకమాస వనభోజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిసి పల్లి మండల సంఘాలు గౌరవ ఆహ్వానం మేరకు కనిగిరి మండల సంఘ అధ్యక్షులు చెలికిచర్ల ప్రకాష్ రావు, గౌరవాధ్యక్షుడు దొడ్డోజు విశ్వనాథ చారి, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతిపాటి బాల రంగాచారి, నూతలపాటి సుధాకర్,రాచకొండ ప్రసాద్, వెలవల శివప్రసాద్, కొత్తపల్లి చంద్రశేఖర్, ఆరికట్ల గోవింద చారి మరియు మండలంలోని విశ్వబ్రాహ్మణ సోదర,సోదరీమణులు అందరూ అధికంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది. అనంతరం ఘనంగా పిసి పల్లి మండల విశ్వబ్రాహ్మణ సంఘ కమిటీ ఆధ్వర్యంలో సంఘీయులను ఘనంగా శాలువాలతో సత్కరించడం జరిగినది.
Admin
Amaravathi Jyothi