Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు వితరణ గుడ్లూరు, అమరావతి జ్యోతి: మండల కేంద్రంలో అయోధ్య నుండి వచ్చిన శ్రీరాములు వారి పుణ్య అక్షింతలు మెయిన్ బజార్ లో ఉన్న రామాలయంలో శ్రీరామ జయరామ జయ జయ రామ అను విజేయమంత్రాన్ని జపిస్తూ అక్షింతలు వృద్ధిచేసి మండలంలో ఉన్న పంచాయతీలకు వితరణ చేయటం జరిగింది.ఈ కార్యక్రమoలో కావలికి చెందిన విశ్వహిందూ పరిషత్ సభ్యులు సురేంద్రరెడ్డి,సంజీవరెడ్డి,వెంకటేశ్వర్లు,గుడ్లూరు మండల (అయోధ్య )శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర కన్వీనర్ ఎయిర్ టెల్ చిన్న మరియు హిందూ సోదరులు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ ప్రాతం అంతా రామానామ జపంతో మారు మ్రోగింది.
Admin
Amaravathi Jyothi