Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : విజయసాయి రెడ్డికి ఘన స్వాగతం పలికిన బుర్ర మధుసూదన్ యాదవ్. కందుకూరు, అమరావతి జ్యోతి : ఉలవపాడులో వైకాపా కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. బుధవారం తొలిసారిగా వైకాపా నెల్లూరు జిల్లా ఎంపీ బరిలో ఉన్న ప్రఖ్యాత చార్టెడ్ అకౌంటెంట్ వి. విజయసాయి రెడ్డి నెల్లూరు జిల్లాలో వైకాపా ఎంపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఉలవపాడుకు విచ్చేసిన సందర్భంగా, కనిగిరి ఎమ్మెల్యే, ప్రస్తుత కందుకూరు వైకాపా సమన్వయకర్త బుర్ర మధుసూదన్ యాదవ్ వేలాది మంది కార్యకర్తలతో, భారీ క్రేన్ల సహాయంతో గజమాలలను విజయసాయి రెడ్డి కి అలంకరించారు. ఈ సందర్భంగా ఉలవపాడు రోడ్లన్నీ వైకాపా జెండాలతో నిండిపోయాయి, విజయ్ సాయి రెడ్డి జిందాబాద్, బుర్ర మధుసూదన్ యాదవ్ నాయకత్వం వర్ధిల్లాలి, జయహో జగన్ అనే నినాదాలతో ఉలవపాడు మారుమ్రోగింది...
Admin
Amaravathi Jyothi