Amaravathi Jyothi - Andhra Pradesh / బాపట్ల : 500 హెక్టార్లలో పంట నష్టం చంద్రబాబు దృష్టికి తెచ్చిన నాగేశ్వరరావు బాపట్ల ,అమరావతి జ్యోతి: బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం, నగరం వద్ద తుఫాను తాకిడికి నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్న నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వ కలిసిన కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు.తుఫాను ప్రభావంతో కందుకూరు నియోజకవర్గంలో సుమారు 500 హెక్టార్లలో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారని నాగేశ్వరరావు, చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. పంట నష్టం వివరాలను చంద్రబాబుకి అందజేశారు. అలాగే సోమశిల ప్రాజెక్టు నుంచి నీళ్లు సక్రమంగా రాకపోవడంతో, రాళ్లపాడు రిజర్వాయర్ కింద వరి సాగు ప్రశ్నార్ధకంగా మారిందని నాగేశ్వరరావు వివరించారు. రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
Admin
Amaravathi Jyothi