Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గుడ్లూరులో కాపు కార్తీక వనభోజనాలు : గుడ్లూరు అమరావతి జ్యోతి: కార్తీక మాసం విశిష్టత పురస్కరించుకుని వన భోజనాలు ప్రాముఖ్యత ఆధారంగా గుడ్లూరు మండల కేంద్రము లో కాపులు వన భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం మండల కేంద్రమునకు సమీపంలో భైరవరపు రాజా మామిడి తోటలో జరిగింది. ముందుగా ఉసిరక చెట్టు దగ్గర కార్తీక దామోదరునికి పూజలు నిర్వహించారు. అనంతరం కాపు వక్తలు మాట్లాడుతూ కార్తీక మాస విశిష్టత వన భోజనాలు ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. అంతేకాకుండా సమాజం లోని అన్ని సామాజిక వర్గాలకు గౌరవిస్తూ మన సొంత కులంలో కూడా అందరూ ఐక్యంగా ఉండాలని బడుగు బలహీన వర్గాలకు మన వంతు పరిపుష్టి ఇచ్చే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి మండలంలో కాపులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులుగా ఇనకొల్లు శ్రీనివాసులు భైరవరపు రాజా మూలగిరి శ్రీనివాస్ అన్నంగి చలపతి అనిమిశెట్టి మాధవ రావు గుత్తి మల్లికార్జున వ్యహరించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారిలో రామిశెట్టి వెంకటేశ్వర్లు మురహరిశెట్టి సుబ్బారావు మద్దిశెట్టి జాలయ్య కొరివి శివాజీ సాదం మస్తానయ్య గునుకుల వెంకటేశ్వరరావు పాటి మహేష్ కొనికి రాజేష్ తదితరులు ఉన్నారు.
Admin
Amaravathi Jyothi