Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : యువగళం పాదయాత్ర ముగింపు సభను జయప్రదం చేయండి - మాలేపాటి. కావలి, అమరావతి జ్యోతి 16; శనివారంరోజు కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఈనెల 20వ తేదీన విజయనగరం జిల్లా, నెల్లిమర్ల నియోజకవర్గం, భోగాపురం మండలం, పొలిపల్లి గ్రామం, భూమాతా లేవుట్ నందు జరిగేటువంటి యువగళం పాదయాత్ర ముగింపు సభ కార్యక్రమానికి కావలి నియోజకవర్గం నుండి అత్యధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు కావలి నియోజకవర్గం నుండి తరలి వెళ్లేందుకు అత్యధిక సంఖ్యలో వాహనాలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. 500 మందికి తగ్గకుండా తరలి వెళ్లాలని ప్రణాళికలు రూపొందించారు. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రావాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది ఒక్క చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని, యువతకు నారా లోకేష్ సారథ్యంలో ఎంతో మేలు కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
Admin
Amaravathi Jyothi