Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ముస్లింలను మోసం చేసిన జగన్ ముస్లిం సోదర సోదరీమణుల ఆధర అభిమానాలను ఎన్నటికీ మరువలేను బొల్లినేని సమక్షంలో టిడిపిలో 50 కుటుంబాలతో చేరిన వైసీపీ సీనియర్ నేత షేక్ సందాని భాష ఉదయగిరి అమరావతి జ్యోతి: ముస్లిం మైనార్టీలను జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తూనే ఉన్నారని వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఉదయగిరి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ బొల్లినేని వెంకట రామారావు ఆరోపించారు. ఉదయగిరి పట్టణంలో దిలార్ బావి వీధిలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ ప్రజా దీవెన కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముస్లిం సోదర సోదరీమణులు తనపై చూపుతున్న ఆధర అభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. అనంతరం వైసిపి ముస్లిం మైనార్టీ నేత షేక్ సంధాని భాష 50 కుటుంబాలతో బొల్లినేని వెంకట రామారావు సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సందాన్ని భాష మాట్లాడుతూ వైసిపి నుంచి టిడిపిలోకి రావడం సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని ఆయన తెలిపారు. పార్టీలో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని బొల్లినేని హామీ ఇచ్చారు.
Admin
Amaravathi Jyothi