Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : మార్కాపురం: జర్నలిస్టుల సమస్యలపై ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏపీయుడబ్ల్యూజే అధ్యక్షులు ఐవి సుబ్బారావు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఐ వి మీడియా సమావేశంలో మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి. సుబ్బారావు అన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్టుల సమస్యల పట్ల సానుకూలంగా ఉండడం అభినందననియమన్నారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టులపై ఇచ్చిన జీవో లను తొలగించి జర్నలిస్టులందరికీ వెంటనే అక్రిడేషన్స్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని,జర్నలిస్టులు చనిపోతే వారి భార్యకు వితంతు పెన్షన్ కింద పదివేల రూపాయలు ఇవ్వాలని,జర్నలిస్టుల సంక్షేమ నిధికి నిధులు మంజూరు చేయాలని,జర్నలిస్టులకు హౌస్ సైట్స్ ప్రక్రియను వెంటనే అమలు చేయాలని,జర్నలిస్టులకు సమాచారం అందించేందుకు సీఎంఓ కార్యాలయంలో ప్రతినిధిని ఏర్పాటు చేయాలని,జర్నలిస్టుల సంక్షేమంతో పాటు సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు డిమాండ్ చేశారు.
Admin
Amaravathi Jyothi