Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : మిచౌంగ్ తుఫాన్ వలన నేలకొరిగిన మిరప నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి. రైతు అధ్యక్షుడు --ఇంద్ర వెలిగండ్ల, అమరావతి జ్యోతి : మండలంలో గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అన్ని రకముల పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని వాటికి నష్టపరిహారాన్ని పెరిగిన రేట్లు కు తగిన విధంగా ప్రభుత్వం వెంటనే అందించేలా చర్యలు చేపట్టాలని కనిగిరి నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షులు కేవలం ఇంద్రభూపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నాడు ఆయన మరపగుంట్ల పంచాయతీలోని రైతు ముత్తిరెడ్డి శ్రీనివాసరెడ్డి మిరప తోటను పరిశీలించడం జరిగినది. పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ రైతు 10 ఎకరాల మిరప పంటను నాటడం జరిగిందని ఇందులో ఐదు ఎకరాలు ముందుగా, మిగిలిన 5 ఎకరాలు లేటుగా నాటడం జరిగిందని ముందుగా నాటిన మిరప బాగా కాపు వచ్చిందని ఈ వర్షానికి పూర్తిగా చెట్టు నేలకు ఒరిగిపోవడం దీనివల్ల కాయలు తెల్లగా రావడం కుళ్ళిపోవడం జరిగిందని గాలులు ఎక్కువగా ఉండటం వలన చాలా కొమ్మలు విరిగిపడి పూర్తిగా పంట దెబ్బతినడం జరిగిందని ఈ మిచౌంగు తుఫాన్ వలన రైతు బాగా నష్టపోవడం జరిగిందని సుమారు పది లక్షల దాకా నష్టం వాటిల్లింది అని ఈ యొక్క నష్టాన్ని అంచనా వేసి వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
Admin
Amaravathi Jyothi