Amaravathi Jyothi - Andhra Pradesh / Konaseema : బీసీల సంక్షేమానికి సీఎం అధిక ప్రాధాన్యం. కడియం, అమరావతి జ్యోతి: రాష్ట్రంలో బీసీల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. రాజమండ్రి రూరల్ వేమగిరి హైవే పక్కన 40 సెంట్ల స్థలంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించబోయే కమ్యూనిటీ హాల్ కు ఎంపీ భరత్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంతో విలువైన ఈ స్థలాన్ని బీసీల కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి కేటాయించడం హర్షణీయమన్నారు. సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ రహదారి పక్కన స్థలం కేటాయించడం సాధారణ విషయం కాదని, రాష్ట్రంలోనే నేషనల్ హైవే పక్కన ఇంత పెద్ద కమ్యూనిటీ హాల్ ఇప్పటి వరకూ ఇదేనని అన్నారు. మొదటి దశలో రూ.50 లక్షలతో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి, ప్రారంభోత్సవం కూడా వెనువెంటనే చేసుకునేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ భరత్ తెలిపారు. రాజకీయ, సామాజిక, ఆర్థికపరంగా బీసీల ఉన్నతిని కోరుకుంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి మనమంతా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. బడుగు, బలహీన వర్గాల వారందరికీ ఈ కమ్యూనిటీ హాలు అన్ని విధాలుగా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ స్థలానికి చేరువులోనే కాలువ ఉందని, ఆ కాలువపై వంతెన మాదిరిగా నిర్మిస్తే డైరెక్ట్ గా నేషనల్ హైవే పై నుంచి కల్యాణ మండపానికి రావడం చాలా సులభమని ఎంపీ భరత్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాస్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi