Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : పుకార్లు నమ్మవద్దు ఉదయగిరి అభ్యర్థిని నేనే అందరి సమిష్టి కృషితో ఉదయగిరి కోటపై జెండా ఎగరడం ఖాయం యువగళం ముగింపు బహిరంగ సభ విజయవంతం చేయండి - బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లండి ఉదయగిరి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో సూచించిన బొల్లినేని వెంకట రామారావు కలిగిరి,అమరావతి జ్యోతి: 2024 ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ గెలుపే ధ్యేయంగా టీడీపీ శ్రేణులు బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ శాసనసభ్యులు మరియు ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ బొల్లినేని వెంకట రామారావు సూచించారు. కలిగిరి లోని బొల్లినేని క్యాంప్ కార్యాలయంలో శనివారం నియోజకవర్గం లోని , ముఖ్యనేతలతో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ ద్వారాప్రజలకు సవివరంగా టీడీపీ లక్ష్యాన్ని ప్రజలకు తెలియజేసేలా వారికి దిశానిర్ధేశంచేశారు. ఈ సందర్భంగా బొల్లినేని రామారావు గామాటాడుతూ పుకార్లు నమ్మవద్దు అభ్యర్థిని నేనేనని టిడిపి శ్రేణులు కు తెలిపారు. అందరి సమిష్టి కృషితో ఉదయగిరి కోటపై జెండా ఎగరవేయడం ఖాయమని తెలిపారు. ఈనెల 18వ తేదిన దుత్తలూరు మండలం నర్రవాడ వెంగమాంబ దేవస్థానం నుంచి ప్రజా దీవెన యాత్ర ప్రారంభిస్తామని తెలిపారు. బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. ఎక్కడికెళ్లినా వైసీపీ అరాచకపాలనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. ప్రజాలంతా టీడీపీ వైపే ఉన్నారని, ప్రజలకు అనుగుణంగా ప్రవేశపెట్టిన టీడీపీ మ్యానిఫెస్టోను వారికి వివరించడంతో పాటు నిత్యం ప్రజల మధ్యనే ఉండాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. 2024లో ప్రజాధరణతో టీడీపీ విజయం తధ్యమని ఆయన చెప్పారు. ఇందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు.యువగళం ముగింపు బహిరంగ సభకు ఉదయగిరి నియోజకవర్గం నుంచి వేలాదిమందిగా నాయకులు కార్యకర్తలు తరలివెళ్లి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పరిశీలకుడు వికాస్ హరికృష్ణ మరియు నియోజకవర్గం లోని ఎనిమిది మండలాల కన్వీనర్లు, క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు, సీనియర్ నాయకులు,కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు
Admin
Amaravathi Jyothi