Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ కొవ్వొత్తులతో ప్రదర్శన. ఉలవపాడు, అమరావతి జ్యోతి: ఉలవపాడు మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి క్రిస్మస్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడి పాఠశాల లబ్ధిదారులైన పిల్లలతో *జగన్ మామ అంగన్వాడి అమ్మల న్యాయమైన సమస్యలను పరిష్కరించండి* అని నినదీస్తూ కొవ్వొత్తులను వెలిగించి పట్టుకొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా నాయకులు జీవీబీ కుమార్ మాట్లాడుతూ 13 రోజుల నుండి అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని నిరవధికంగా సమ్మె చేస్తున్నారని పేర్కొన్నారు. అంగన్వాడి పాఠశాలలు మూతపడటంతో మాకు గుడ్డు లేదు, భోజనం లేదు, ఆటపాటలు లేవని పిల్లలు ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. జగన్ మామ మా అంగన్వాడీ అమ్మల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ప్రాజెక్టు లీడర్ సిహెచ్ ఇంద్రావతి, కార్యకర్తలు ఎస్ గీత, జే వసంత, నాగమణి, తిరుపతమ్మ, ప్రవీణ వెంకటరమణమ్మ, సుల్తాన్ బీ సుస్మిత, అంగన్వాడి పాఠశాల పిల్లలు నిషిత, లెహన్స్, లాస్య, చెర్రీ,మోక్షజ్ఞ, అఖిల్, జోషఫ్ ధనుష్ తదితరులు పాల్గొన్నారు
Admin
Amaravathi Jyothi