Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : మార్కాపురంలో భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం. మార్కాపురం అమరావతి జ్యోతి: మార్కాపురం అసెంబ్లీ స్థాయిలో భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించి , జ్యోతి ప్రజ్వలన చేసిన ప్రకాశం జిల్లా బిజెపి అధ్యక్షులు పివి శివారెడ్డి , మరియు జిల్లా ఇన్చార్జి పునుగుల రవిశంకర్ , ఈ సందర్భంగా పీవీ శివారెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మొన్న జరిగిన ఎన్నికలలో ఐదు రాష్ట్రాల్లో పోటీ చేయగా మూడు రాష్ట్రాలను కైవసం చేసుకున్నామని తెలియజేశారు. మన ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం మార్కాపురం అసెంబ్లీ కన్వీనర్ పివి కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కంభం వెంకటరమణ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పిచ్చయ్య , అసెంబ్లీ కో కన్వీనర్ దేవిశెట్టి చంద్రశేఖర్ , జిల్లా కార్యదర్శి మొర్రి బోయిన చిన్నయ్య , సీనియర్ నాయకులు పైడిమర్రి శ్రీనివాసులు , పట్టణ అధ్యక్షులు పైడిమర్రి రామచంద్ర , మండల అధ్యక్షులు సైక్యం శివప్రసాద్ రెడ్డి , లీగల్ సెల్ కన్వీనర్ కడియం రామయ్య యాదవ్ , మహిళా మోర్చా నాయకురాలు మద్దెల లక్ష్మీ , మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు మిరియాల వాసవి , బిజెపి అధికార ప్రతినిధి పొట్టి సుబ్బారావు , జిల్లా కార్యవర్గ సభ్యులు సింగరి సత్యనారాయణ , బొచ్చు లక్ష్మారెడ్డి , పెద్దారవీడు మండల అధ్యక్షులు బొచ్చు కోటి రెడ్డి, దోర్నాల మండల అధ్యక్షులు సురవరం గండి వీరారెడ్డి, పలువురు జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi