Amaravathi Jyothi - Andhra Pradesh / Sir Balji Dist : తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ చిత్తూరు,అమరావతి జ్యోతి: రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి అహ్వానించగా… అర్చక బృందం ఇస్తికఫాల్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనా యకుల మండపంలో ఎస్.అబ్దుల్ నజీర్కు వేదపండితులు వేదాశీ ర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్, ఈవో తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, విజివో నంద కిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు......
Admin
Amaravathi Jyothi