Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన గుడ్లూరు హైస్కూలు విద్యార్థిని. గుడ్లూరు, అమరావతి జ్యోతి:మండల కేంద్రమైన గుడ్లూరు హైస్కూల్ కు చెందిన ఆలూరి అలేఖ్య హేమర్ త్రోలో జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పివి రామ్మోహన్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి ప్రకాశం జిల్లా తరుపున రాష్ట్ర స్థాయి అండర్ -17 కేటగిరి నందు యం. హేమంత్ (లాంగ్ జంప్), ఆలూరి అరేఖ్య (హేమర్ త్రో), జొన్న వాడ వాసవి (100 మార్టిల్స్) లో ప్రాతినిధ్యం వహించారు. వారిలో ఆలూరి అలేఖ్య నరసరావుపేట నందు జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొని హేమర్ త్రో నందు గోల్డు మెడల్ సాధించి పాట్నాలో జరుగు జాతీయ పోటీలకు ఎంపిక కావడం జరిగినది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాయులు. పి.వి. రామమోహన్, వ్యాయాను ఉపాధ్యాయుడు జి. మాల్యాద్రి ఉపాధ్యాయినీ ఉపాధ్యా యులు ఇతర సిబ్బంది ఆ విద్యార్థులను అభినందించారు.
Admin
Amaravathi Jyothi