Monday, 15 June 2026 03:48:37 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

రెవిన్యూ ఆఫీస్ పరిధిలో పెట్రోల్ బంకు ఏర్పాటు సరైనది కాదు

Date : 21 November 2024 03:43 PM Views : 772

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : రెవిన్యూ ఆఫీస్ పరిధిలో పెట్రోల్ బంక్ నిర్మాణం సరైనది కాదు..? కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి మండలి ఆక్షేపణ. కందుకూరు రెవెన్యూ ఆఫీస్ పరిధిలో పెట్రోల్ బంకు నిర్మాణం చేయాలని చేస్తున్న ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ కందుకూరు నియోజకవర్గం అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో ఈరోజు మండల తాసిల్దార్ని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగినది. పెట్రోల్ బంకును దాదాపు పది పైగా ప్రభుత్వ ఆఫీసులు ఉన్న ప్రాంగణంలో నిర్మించాలని తీవ్ర ప్రయత్నం చేయటం సరైనది కాదు. ప్రభుత్వం వారు చెబుతున్నట్లు రెవెన్యూ పరిధిలోని ఈ బంకును నిర్మించాలని అనటం ఆక్షేపనీయం. పెట్రోల్ బంకు నిర్మాణం వలన ప్రభుత్వ ఆఫీసుల కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. అదేవిధంగా శతాబ్దాల చరిత్ర కలిగిన చెట్లను నరకడం వల్ల పర్యావరణానికి తీవ్రమైన హాని ఏర్పడుతుంది. ముఖ్యంగా నిత్యం రద్దీ ట్రాఫిక్ ఉన్న ఓవీ రోడ్డుకి ఆనుకుని ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పెట్రోల్ బంకు నిర్మాణం చేయటం వలన చుట్టూ ప్రభుత్వ ఆఫీసులకు గాని నివాస ప్రాంతాలకు గాని దగ్గరలో ఉన్న ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు గాని రక్షణ ఉండదు. నిత్యం ట్రాఫిక్ వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడి పాదాచారులకు సురక్షితము లేకుండా పోతుందని, రోడ్డు సైడ్ ఉన్న చిరు వ్యాపారుల జీవనోపాధి కోల్పోతారని అభివృద్ధి మండలి ఆక్షేపిస్తుంది. తాసిల్దార్ స్పందిస్తూ గతంలోనే పెట్రోల్ బంకునకు నిర్మాణమునకు అన్ని అనుమతులు రెవెన్యూ సిబ్బంది మంజూరు చేసి ఉన్నదని,ఈ బంక్ నిర్మాణం రెవెన్యూ భూమి పరిధిలోనే నిర్మాణం చేయవలసినదని తెలిపారు. అభివృద్ధి మండలి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మేము దీనిని నిరసిస్తున్నామని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సరైన చర్యలు తీసుకొని,రెవెన్యూ ప్రాంతంలో మరొకచోట ప్రజలకు ఇబ్బంది లేని ఎక్కడైన పెట్రోల్ బంకు నిర్మాణం చేసుకొనుటకు అభివృద్ధి కమిటీకి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి మండలి సభ్యులు తోకల వెంకటేశ్వర్లు, పులిచెర్ల వెంకట సుబ్బారెడ్డి, అధికార ప్రతినిధి ముప్పవరపు కిషోర్, చింతరబోయిన నరేష్, సిహెచ్ గోపాల్,రేణమాల అయ్యన్న, డి ఆదిలక్ష్మి, టి కృష్ణారావు, జె. నరసింహ, యు మాధవరావు, ఎం శ్రీను, ఎస్ కె ఖుద్ధీస్, ఎస్డి రబ్బాని, ఎస్కే రహమతుల్లా, బి నాగరాజు, ఎస్కే మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :