Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : లింగసముద్రం: . ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు హైదరాబాదు నుండి నేరుగా రాళ్లపాడు జలాశయానికి చేరుకున్నారు. అక్కడ ఇంజన్లతో రైతుల పొలాలకు అందజేస్తున్న నీటి సరఫరా తీరు తెన్నులనునిశితంగా పరిశీలించారు. అనంతరం రాళ్ళపాడు ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ను ఆయన పరిశీలించి, రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయించారు.నీరు రైతులకు పరిపూర్ణంగా అందించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ,ఇరిగేషన్ జిల్లా బాధ్యులు రైతులు తదితరులు ఉన్నారు.
Admin
Amaravathi Jyothi