Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : వలేటివారిపాలెం : సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్సార్ సీపీ మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరు మద్దతు బుర్ర లక్ష్మీనారాయణతెలపాలని చుండి సర్పంచ్ ఇరపని సతీష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండలంలోని చుండి గ్రామంలో వైసిపి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్ర మధుసూదన్ యాదవ్ కుమారుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ పాలనలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పారదర్శకంగా పథకాలు అమలు చేశారన్నారు. జగనన్న ఇచ్చిన హామీల్లో 99 శాతం హామీలు అమలు చేశారని మరోసారి ముఖ్యమంత్రి అయితే బడుగు బలహీన వర్గాల జగన ఉపాధికి మరింత చేయూత అందిస్తారని చెప్పారు. ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్ యాదవ్, ఎంపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి లను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పేయ్యల హరిబాబు, పేయ్యల నరసింహం డబ్బు కొట్టు హరిబాబు, తదితరులు పాల్గొన్నారు
Admin
Amaravathi Jyothi