Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : శ్రీ శ్రీ కళా వేదిక ప్రపంచ సాహిత్య కళా ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి కందుకూరు, అమరావతి జ్యోతి: శ్రీశ్రీ కళావేదిక ప్రపంచ సాహిత్య కళ ఉత్సవాల కరపత్రాన్ని శుక్రవారం తన కార్యాలయంలో శ్రీ శ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీ శ్రీ కళావేదిక తెలుగు సాహిత్య అభివృద్ధికి సూచిక అని అన్నారు. ఈ నెల 16 ,17. తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లా లోని,తాడేపల్లిగూడెంలోఉన్న బుద్దాల కన్వెన్షన్ హాలులో ఏక బిగిన 30 గంటల 30 నిమిషాల 30 సెకండ్ల కాలంలో, నిర్విరామంగా కవితా గోస్టులు, సాహిత్య సేవ జరగడం ఎంతో అభినందనీయమన్నారు, ఈ సాహిత్య యజ్ఞంలో వెయ్యి మంది సాహితీవేత్తలు పాల్గొననుండడం తనను అబ్బురపరిచిందన్నారు. శ్రీశ్రీ కళావేదిక తెలుగు భాష అభివృద్ధికి చేస్తున్న కృషినిఈ సందర్భంగా ఆయన కొనియాడారు. శ్రీ శ్రీ కళావేదికకు జాతీయ అధ్యక్షురాలుగా ఈశ్వరి భూషణం అత్యంత అంకితభావంతో పనిచేస్తున్నారని, ఉపాధ్యాయురాలుగా, కవయిత్రిగా రచయిత్రిగా, ఆమె బహుముఖ ప్రజ్ఞ ను ప్రదర్శిస్తుండటం ఎంతో ఆనందదాయకమన్నారు.
Admin
Amaravathi Jyothi