Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గురువును మించిన దైవం లేదు.. మీ ఆత్మీయతను ఎన్నడూ మరువను.. ఉదయగిరి నియోజకవర్గం టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ వింజమూరు, అమరావతి జ్యోతి: గురువుకు మించిన దైవం లేదని మీ ఆత్మీయతను ఎన్నడూ మరువను అని ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం బిజెపి జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. వింజమూరులోని ఎస్వీ కళ్యాణమండపంలో ఆదివారం నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కాకర్ల సురేష్ మాట్లాడుతూ తల్లి తండ్రి తర్వాత ఉపాధ్యాయులను దైవంగా చూస్తానని ఆయన తెలిపారు. సుధీర ప్రాంతాల నుండి అనేక కష్టనష్టాలకు ఓర్చి ఇంత దూరం వచ్చిన మీ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. మెట్ట ప్రాంతంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివి అంచలంచెలుగా ఎదిగి అమెరికాకు వెళ్లిన నేను పుట్టిన గడ్డపై మమకారంతో ఈ ప్రాంత అభివృద్ధి సంపద సృష్టించేందుకు వచ్చానని మీరందరూ ఆదరిస్తే మార్పు తీసుకొస్తానని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. విద్య వైద్యానికి పెద్దపీట వేస్తానని తెలిపారు. కనుక వచ్చే ఎన్నికల్లో మీరందరూ నాకు అండగా నిలవాలని కోరారు. అంతకుమునుపు ఎల్ సి రమణారెడ్డి మాట్లాడుతూ కాకర్ల సురేష్ గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఎనలేని సేవలు అందిస్తున్నారన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ రోగుల ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రధం చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు యువతను ప్రోత్సహించేందుకు క్రీడా పోటీలు మహిళలు మహారాణులు చేసేందుకు టైలరింగ్ బ్యూటిషన్ కోర్సులు మూగ జీవాల కోసం ఎడారి ప్రాంతంలో బోరింగులు అభాగ్యులకు ఆర్థిక సహాయం నూతన వధూవరులకు పెళ్లి కానుకలు అందజేస్తూ అందరి ఇంటఆపద్బాంధవుడు అయ్యాడు, కాకర్ల సురేష్ అని పేర్కొన్నారు. ఆయన ఈ నియోజకవర్గంలో జన్మించడం ఇక్కడ అభివృద్ధి కోరుకోవడం మన అదృష్టంగా భావించి మనమందరం ఆయనకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. అదేవిధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్నికల హామీలోభాగంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని తెలిపి, ఐదు సంవత్సరాలుకాలయాపన చేసి కల్లబొల్లి మాటలతో మన గొంతు నొక్కుతున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే మనం అధోగతి పాలవుతామని ఈ ప్రభుత్వానికి సమర గీతం పాడి టిడిపిని అధికారంలోనికి తెచ్చుకొని చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకొని కాకర్ల సురేష్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. చప్పట్లతో ఉపాధ్యాయులు అందరూ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మండలాల వారీగా కాకర్ల సురేష్ ను ఉపాధ్యాయుల బృందం శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాల్ ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయులు సంక్షేమ వసతి గృహాల వార్డెన్ లు సిబ్బంది అభిమానులు తదితరులు ఉన్నారు.
Admin
Amaravathi Jyothi