Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గుడ్లూరు: చిరస్మరణీయులు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎండిఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆమరణ దీక్ష చేసి 58 వ రోజున తుది శ్వాస విడిచి అమర జీవిగా చిరస్మరణీయులుగా నిలిచారని వారి ఆత్మార్పణ కారణంగా మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయిందని తెలియజేయడమైనది అందువలన ఈ రోజున వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాలకుర్తి శంకర్ టిడిపి నాయకులు పువ్వాడి వేణుగోపాల్ మేకపోతుల రాఘవులు ఉన్నం వెంకటేశ్వర్లు, పాలకిర్తి బ్రహ్మయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఇన్మమూరి ప్రమీల సుధాకర్ ,ఇరువురు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi