Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : 35వ వార్డు నుండి చేరికలు - పసుపులేటి ముఖ్య అనుచరుడు గుంజి ప్రసన్న కుమార్ టీడీపీ లో చేరిక కావలి,అమరావతి జ్యోతి :కావలి పట్టణం 35వ వార్డు నుండి పలువురు టీడీపీ లో చేరారు.. కావలి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పసుపులేటి సుధాకర్ ముఖ్య అనుచరుడు గుంజి ప్రసన్న కుమార్, బీజేపీ కావలి పట్టణ ఉపాధ్యక్షులు బాలు యాదవ్, విజయమ్మ, సుశీలమ్మ, మల్లి సుబ్రహ్మణ్యం, మల్లి మురళి, సూరి, వెంకటేష్ యనమల రవి, హజరత్ నాయుడు, గుంజి ప్రభాకర్, కృష్ణ, తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి కావలి నియోజకవర్గ టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని క్రిష్ణారెడ్డి హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, జనసేన కావలి నియోజకవర్గ అధికార ప్రతినిధి మన్నేపల్లి రిషికేష్, 35వ వార్డు మాజీ కౌన్సిలర్, వార్డు సీనియర్ నాయకులు కొమర రమణయ్య, 9వ వార్డు మాజీ కౌన్సిలర్ బిట్రగుంట శివ, తదితరులు పాల్గొన్నారు..
Admin
Amaravathi Jyothi