Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా పెద్దాయన దామచర్ల ఆంజనేయులు 18వ వర్ధంతిని పురస్కరించుకుని టంగుటూరు మండలం మర్లపాడు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని దామచర్ల ఆంజనేయులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత,, గొట్టిపాటి రవికుమార్,,డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు కలిసి నందమూరి తారక రామారావు, పరిటాల రవీంద్ర, మరియు దామచర్ల ఆంజనేయులు విగ్రహాలను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, తెలుగు ప్రజల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసిన మహా నేతలు నందమూరి తారక రామారావు, పరిటాల రవీంద్ర, మరియు దామచర్ల ఆంజనేయులు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. తెలుగు ప్రజల కోసం నందమూరి తారకరామారావు చేసిన సేవలు తెలుగు ప్రజలు ఏప్పటికీ మర్చిపోలేరని , పేద ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి పరిటాల రవీంద్ర గారిని జీవితాంతం ప్రజల సేవలో అంకితమైన ప్రకాశం జిల్లా పెద్దాయన దామచర్ల ఆంజనేయులు నిస్వార్థ సేవలు మనందరికీ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు.
Admin
Amaravathi Jyothi