Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : వైసీపీకి గుడ్ బై 14న టిడిపిలో చేరుటకు రంగం సిద్ధం వెంకటేశ్వర రెడ్డి వెలిగండ్ల, అమరావతి జ్యోతి : మండల కేంద్రమైన వెలిగండ్లలో బుధవారం వైసీపీ పార్టీ నాయకుడు కర్నాటి వెంకటేశ్వర రెడ్డి( పాన్) పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, గత ఎన్నికల్లో పార్టీ కోసం ఎంతో కష్టపడి ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను నా సొంత డబ్బులను ఖర్చుపెట్టి గెలిపించుకోవడంలో నా వంతు కీలక పాత్ర పోషించడం జరిగిందని అయినప్పటికీ కష్టపడి పనిచేసే వారికి వైసీపీలో గుర్తింపు లేదని అలాంటప్పుడు పార్టీలో ఉండటం కష్టం అనిపించిందని ఒకవైపు పార్టీని వీడడం బాధాకరమైన విషయం అయినప్పటికీ కొంతమంది నాయకుల పద్ధతులు వైసీపీ పార్టీ విధానాలు నచ్చక పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. గత కొద్దికాలం నుండి పార్టీలో నాకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా దూరం పెట్టడం వలన నా మనసు ఎంతో కలత చెందడం జరిగిందన్నారు. అందువల్లనే నా సంపూర్ణ మద్దతును ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి తెలియజేస్తూ కనిగిరి నియోజకవర్గం సస్యశ్యామలం కావాలంటే అది ఉగ్ర నరసింహారెడ్డి తోనే, జరుగుతుందని రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే అది తెలుగుదేశంపార్టీ తోనే సాధ్యమవుతుందని అందువలనే ఈనెల 14న నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానన్నారు. మొగల్లూరు లోని సత్యదేవ a1 క్వాలిటీ ఫంక్షన్ హాల్ లో కార్యకర్తలతో పాటు భారీగా వైసీపీని వీడి టిడిపి కండువా కప్పుకోవడం జరుగుతుందన్నారు.
Admin
Amaravathi Jyothi