Monday, 15 June 2026 03:52:00 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

రామాయపట్నం హైస్కూల్ పీడిని సస్పెండ్ చేసే వరకు పోరాటం

మరోసారి విచారణ అంటే పాఠశాలకు తాళాలు వేస్తాం విచారనాధికారి ఎదుట వాపోయిన గ్రామ సర్పంచ్, స్కూల్ కమిటీ చైర్మన్ , గ్రామస్తులు

Date : 21 September 2025 07:18 AM Views : 1209

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు,: ఉలవపాడు మండలం రామాయపట్నం హైస్కూల్లో పనిచేస్తున్న పిడిని సస్పెండ్ చేయాలని లేని పక్షంలో దసరా సెలవుల అనంతరం పాఠశాలకు తాలాలు వేస్తామని ఆ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, పాలిపేట సర్పంచ్ రమణయ్య, గ్రామస్తులు విచారణకు వచ్చిన కందుకూరు డిప్యూటీ డీఈఓ కు తేల్చి చెప్పారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టి నివేదిక అందించాలని డి ఈ ఓ ఆదేశించడంతో కందుకూరు డిప్యూటీ డిఈవో శనివారం ఆ పాఠశాలకు వచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు విచారణ అధికారి వద్దకు వచ్చి పిడి పై అనేక ఆరోపణలు చేశారు. ఇప్పటికే రెండోసారి ఆయనపై విచారణ చేసేందుకు వచ్చారని ఎన్నిసార్లు వచ్చినా తాము చెప్పేది ఒకటేనని ఆరోపణలు ఎదుర్కొంటున్న పిడిని సస్పెండ్ చేయాలని వారు కోరారు. పాఠశాలకు మారణాయుధాలతో రావడం ఎంతవరకు కరెక్ట్ అని అలా వస్తే విద్యార్థులకు ఏం సందేశం ఇవ్వనున్నారని వారు ప్రశ్నించారు. ఆ మేరకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ డి ఈ ఓ మాట్లాడుతూ మీరిచ్చిన స్టేట్మెంట్ను ఉపాధ్యాయులు ఇచ్చే స్టేట్మెంట్లను నివేదిక రూపంలో డీఈఓ కు పంపనన్నట్లు తెలిపారు. తాను నివేదికలను ఉన్నతాధికారులకు పంపడం తప్ప చర్యలు తీసుకునే అధికారం తనకు లేదని ఆయన పేర్కొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :