Amaravathi Jyothi - Andhra Pradesh / NTRDistrict : విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్ధిగా నగర మేయర్ భాగ్యలక్ష్మి ఉమ్మడి కృష్ణా వైసీపీ అభ్యర్థులు వీరే విజయవాడ, అమరావతి జ్యోతి: రానున్న ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఎట్టకేలకు మంగళవారం ఉమ్మడి కృష్ణా జిల్లా అభ్యర్థుల జాబితా దాదాపు ఒకకొలిక్కి వచ్చింది. అనూహ్యంగా అభ్యర్ధులను మార్చిన వైసిపీ అధిష్టానం. 90 శాతం సిట్టింగులకు మార్పులు తప్పలేదు. విజయవాడ పార్లమెంటు అభ్యర్థిగా వల్లభనేని వంశీ మోహన్ కు కేటాయించారు. విజయవాడ తూర్పు నుంచి సామినేని ఉదయభాను కు కేటాయించగా, విజయవాడ పశ్చిమ నుంచి మేయర్ రాయన భాగ్య లక్ష్మీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మైలవరం నుంచి జోగి రమేష్ ఉండగా నందిగామ అమర్లపూడి కీర్తిసౌజన్య (సీఎం ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ జోషి మరదలు) పోటీలో ఉండగా జగ్గయ్యపేట పేట: వసంత కృష్ణ ప్రసాద్ కు ఇచ్చారు.తిరువూరు నుంచి మాజీ ప్రభుత్వ అధికారిణి పోటీ చేస్తారని అంటున్నారు. అలాగే గన్నవరం సీటు కొలుసు పార్థసారథి కు కేటాయించగా, పెనమలూరు సీటు దేవినేని అవినాష్ కు దక్కింది.
Admin
Amaravathi Jyothi